- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దానిని ‘గేమ్ చేంజర్’ అనడం పెద్ద జోక్.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేరు కాబట్టి ప్రజల మనోభావాలను అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండడం లేదని, ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని మండిపడ్డారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రికార్డు స్థాయిలో వరి పండిందని గవర్నర్ తన ప్రసంగంలో అన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే 2.6 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండేదని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డను బూచీగా చూపించి మొత్తం తెలంగాణ పంటలను ఎండబెట్టడం సబబు కాదని సూచించారు. రైతులు పంటలను కాలపెట్టుకునే బాధాకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు 7 మీటర్ల మేరా పెరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాగునీటి కల్పనలో పూర్తిగా విఫలమైందని ఎండగట్టారు. ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక రైతు కుటుంబాలు బాధ పడుతున్నాయని, రూ 50 వేల కోట్లు ఖర్చు చేస్తేనే రైతులందరికీ రూ 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తవుతుందని, కానీ కేవలం రూ 20 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామని చెప్పించి గవర్నర్ను కూడా తప్పదోవపట్టించారని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ బోగస్ అయిందని, రాష్ట్రంలో అత్యధిక రైతులకు బోనస్ రాలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.
కృష్ణా జలాలపై పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అదే నిజమైతే నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ఇంకా తెలంగాణ ఆధీనంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ జలాలను తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? అని నిలదీశారు. మహాలక్ష్మీ పథకాన్ని గేమ్ చేంజర్గా అభివర్ణించడం హాస్యాస్పదమన్నారు. మూడు నాలుగు పథకాల సమూహమైన మహాలక్ష్మీ పథకాన్ని పాక్షికంగా అమలు చేసి పూర్తిగా అమలు చేశామని చెప్పడం అర్థసత్యమేనని స్పష్టం చేశారు. అబద్దం కంటే అర్థసత్యం చాలా ప్రమాదమని చెప్పారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వకుండానే మహాలక్ష్మి పథకం ఎలా పూర్తిగా అమలవుతున్నట్లు? అని అడిగారు. మహిళలకు గ్యాస్ సబ్సిడీ సరిగ్గా అందడం లేదని, దీనిపై ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్(KCR) హయాంలో కూడా ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచడం జరిగిందని, ప్రభుత్వ ఆస్పత్రులను కూడా కేసీఆర్ బలోపేతం చేశారని గుర్తుచేశారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయించారని, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది లేదు.. దూది లేదు.. మందులు అసలే లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికెటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో పెట్టడం లేదు ? అని నిలదీశారు. సర్వే ద్వారా సేకరించిన వివరాల్లో కులాల వారీగా, గ్రామాల వారీ వివరాలను ఎందుకు బహీర్గతం చేయడం లేదు ? అని అడిగారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టే లోపు చట్టసభల్లో ఆ వివరాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను కూడా అసెంబ్లీలో, మండలిలో పెట్టాలని సూచించారు.
READ MORE ...
ఏందయ్యా నీ లొల్లి.. న్యూసెన్స్ చేస్తున్నావ్.. మండలిలో ఎమ్మెల్సీపై చైర్మన్ గుస్స